వేర్వేరు ఆలయాల్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఆలయాల్లో చోరీ

May 29 2025 1:13 AM | Updated on May 29 2025 1:13 AM

వేర్వేరు ఆలయాల్లో చోరీ

వేర్వేరు ఆలయాల్లో చోరీ

రూ.2.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.25 వేల నగదు అపహరణ

జరుగుమల్లి(సింగరాయకొండ)/కొండపి: కొండపి నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో మంగళవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి తెగబడ్డారు. జరుగుమల్లి మండలం ఎన్‌ఎన్‌ కండ్రిక కొత్తపాలెంలోని అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి కిరీటం, సుమారు రూ.20 వేల నగదు చోరీ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

● కొండపి మండలంలోని పెట్లూరు శివాలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి నగలు దోచుకెళ్లారు. సుమారు రూ.1.50 లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయ్యాయని గ్రామస్తులు తెలిపారు. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అంకారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement