ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

May 28 2025 5:47 PM | Updated on May 28 2025 5:47 PM

ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

హౌసింగ్‌ స్పెషలాఫీసర్‌ అన్నపూర్ణ

అల్లూరు (కొత్తపట్నం): మండలంలోని అల్లూరు గ్రామ పరిధిలోని జగనన్న లే అవుట్లను హౌసింగ్‌ స్పెషలాఫీసర్‌ ఎన్‌ అన్నపూర్ణ మంగళవారం పరిశీలించారు. గ్రామంలోని నాలుగు జగనన్న లే అవుట్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎస్టీలకు అదనంగా రూ.75 వేలు కేటాయిస్తే ఎందుకు ఇళ్లు నిర్మించుకోలేదని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ నీటి వసతి లేకపోవడంతో నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. కాలనీలకు నీరు వచ్చేలా చూడాలని కోరారు. నాలుగు లే అవుట్లలో 193 గృహాలు మంజూరు కాగా 42 పూర్తయ్యాయని, శ్లాబ్‌ దశలో 14, బేస్‌మట్టం 95, మిగిలిన 42 వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లే అవుట్లకు నీటి సౌకర్యం వెంటనే కల్పించాలని ఎంపీడీఓను ఆదేశించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాసరావు, హౌసింగ్‌ ఇన్‌చార్జి ఏఈ వలిరాజు, ఉప సర్పంచ్‌ తాటపర్తి సుబ్బారెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement