
జైలు జీవితం మార్పునకు నాంది పలకాలి
● జిల్లా జైలును సందర్శించిన ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: జైలు జీవితం కేవలం శిక్షకు మాత్రమే పరిమితం కాదని.. అక్కడి నుంచే సానుకూల మార్పునకు నాంది పలకాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. మంగళవారం జిల్లా జైలును ఆయన సందర్శించారు. జైలు గదులు, హాస్పిటల్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం జైలు అంతర్గత భద్రతపై జైలు అధికారులు, సెక్యురిటీ రివ్యూ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా ఖైదీలకు ప్రత్యేక భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జైలులో నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. రిమాండ్ ఖైదీలను తరలించే సమయంలో పోలీసులు, జైలు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్పీ వెంట జైలు సూపరెండెంట్ పి. వరుణా రెడ్డి, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలుకా సీఐ విజయ కృష్ణ, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఆర్ఐ సీతారామి రెడ్డి, జిల్లా జైలర్ రమేష్, ఎం.శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాసరావు, కారాగార వైద్యాధికారి యస్వియస్ బ్రహ్మతేజ తదితరులు వున్నారు.