
పోలేరమ్మ ఆలయంలో చోరీ
బాలికపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తి అరెస్టు
కంభం: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు కంభం ఎస్సై బి. నరసింహారావు తెలిపారు. కేసు వివరాలను సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. వివరాలు.. ఈనెల 23వ తేదీన మండలంలోని జంగంగుంట్ల గ్రామానికి చెందిన మునిగేటి శౌరయ్య అనే వృద్ధుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలికకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. అదే రోజు మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో వృద్ధుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం కంభం–జంగంగుంట్ల మధ్యలో హైవే రోడ్డుపై కందులాపురం అడ్డరోడ్డు వద్ద నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.