
డేగల కన్ను
కొండపోరంబోకు భూములపై
భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. తహసీల్దార్ ఆదేశాల మేరకు భూములు కొనుగోలు చేసిన వారిని, తెచ్చిన వాహనాలను పోలీసులకు అప్పగించాం. భూముల ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం.
– రమాదేవి, వీఆర్ఓ
అధికారులకు ముందే చెప్పాను
ప్రభుత్వ భూముల్లో బోర్లు వేస్తున్నారని తహసీల్దార్కు రెండు సార్లు ఫిర్యాదు చేశాం. ఒకసారి వీఆర్వోను పంపారు. ఆ సమయంలో బోర్లు వేయలేదు. రాత్రికి రాత్రి బోర్లు వేశారు. మా భూములు కాపాడండి. భూములు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి.
– మారెళ్ల రామాంజి, గ్రామస్తుడు
ఎవరు వచ్చినా అడ్డుకుంటాం ..
ప్రభుత్వ భూములు మా నాన్న సర్పంచ్ కాలంలో ఇలాగే ఆక్రమణలు జరిగాయి. అప్పుడు అడ్డుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఆక్రమించాలని చూస్తున్నారు. వాటిని కాపాడుకుంటాం. ఎవరు వచ్చి అడ్డుకుంటాం. ప్రభుత్వ కర్మాగారాలకు ఈ భూములను ఉపయోగించుకోవచ్చు.
– మారెళ్ల కాశీ వెంకట చెన్నకేశవులు,మాజీ సర్పంచ్
అధికార పార్టీ అండగా..అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోయి తన్నుకుపోతున్నారు. ప్రభుత్వ భూముల సమాచారం సేకరిస్తున్న పెద్దలు ఆ భూములు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆక్రమణల పర్వం జోరందుకుంది. అధికార పార్టీ నేతల అండ, అధికారుల సహకారంతో వందల ఎకరాలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.
కురిచేడు: మండలంలోని పెద్దవరం రెవెన్యూ పరిధిలోని కొండపోరంబోకు భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అధికార పార్టీ అండదండలతో పెద్ద పెద్ద డేగలు ఈ భూములపై వాలాయి. వివరాల్లోకి వెళితే..మండలంలో పెద్దవరం సర్వే నంబర్ 306 లో 630 ఎకరాల కొండపోరంబోకు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని చాలా మంది ఆ ప్రాంత ప్రజలు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఏకంగా పక్కా జిల్లాల నుంచి ఆక్రమణదారులు రంగప్రవేశం చేశారు. వినుకొండకు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి సదరు సర్వే నంబర్లోని 67 ఎకరాలను ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన వారికి విక్రయించి రూ.2 కోట్లు దండుకున్నాడు. మండలంలోని ఎన్ఎస్పీ అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తి మధ్యవర్తిత్వం వహించి ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతోటి వరప్రసాదు, నందిగం మండలం కొత్తబెల్లం కొండవారిపాలెం గ్రామానికి చెందిన పొన్నగంటి రమేష్, విజయవాడ భవానీపురం గ్రామానికి చెందిన చావ మదన్మోహన్, వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన కంతేటి వీరాంజనేయులు, చందర్లపాడుకు చెందిన కె.వెంకటేశ్వరరావు, బెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన కడియాల సుబ్బారావులకు ఆ భూములు విక్రయించారు. ఆ భూముల్లో సాగు చేసేందుకు ఇటీవల కాలంలో సుమారు 9 బోర్లు సైతం వేయించారు. ఈ క్రమంలో ఆదివారం 20 మందికి పైగా వచ్చి ఆ భూముల్లో సాగుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భూమల వద్దకు చేరుకున్నారు. సాగు చేస్తున్న వారిని అడ్డుకొని రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వీఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకొని భూములు సాగుచేసేందుకు వచ్చిన వారిని, వారి వాహనాలు, జనరేటర్, ఇతర మిషన్లను పోలీసులకు అప్పగించారు.
గ్రామస్తులను ప్రలోభపెట్టేందుకు..
భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన ఆక్రమణదారుల వద్ద ఎటువంటి పట్టాలు గానీ, ఎటువంటి పత్రాలు లేని లేవు. కానీ గ్రామస్తులను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. కోట్లాను కోట్లు వెచ్చించి తాము కొనుగోలు చేశామని ఒకసారి, లీజుకు తీసుకున్నామని, సాగు చేసుకుంటున్న రైతులు లీజుకు ఇచ్చారని..ఆదినారాయణ లీజుకు ఇచ్చారని, రకరకాలుగా మాట్లాడి అధికారులను, గ్రామస్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. మాకు కూటమి నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఎలాగైనా ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని, అధికారులతో మంతనాలు చేయడం విశేషం. ఈ ఆక్రమణదారులకు అండగా ఉన్న ప్రజాప్రతినిధులు, ఆక్రమణదారులు ఎవరని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
అధికారుల అలసత్వం..
గత 20 ఏళ్లుగా ఈ కొండపోరంబోకు భూముల ఆక్రమణలు, వివాదాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వ అదికారులు పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. దీంతో తరుచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ కర్మాగారాలకు ఈ భూములు కేటాయించి అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్న కొండపోరంబోకు భూములు
67 ఎకరాలు ఆక్రమించి విక్రయం భూములు స్వాధీనం చేసుకుంటుండగా అడ్డుకున్న గ్రామస్తులు ఆక్రమణదారులకు అధికార పార్టీ నేతల అండ

డేగల కన్ను

డేగల కన్ను

డేగల కన్ను

డేగల కన్ను

డేగల కన్ను