ధరల కాటు! | - | Sakshi
Sakshi News home page

ధరల కాటు!

May 26 2025 1:30 AM | Updated on May 26 2025 1:59 AM

ధరల క

ధరల కాటు!

పొగాకు రైతుపై

మార్కాపురం / తర్లుపాడు: పొగాకు రైతుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. కూటమి ప్రభుత్వంలో బయ్యర్లు కుమ్మకై ్క ధరలు తగ్గిస్తుండటంతో గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో వేలం ప్రారంభమై రెండు నెలలు దాటినా ధరల అనిశ్చితి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భారీగా పెరిగిన పెట్టుబడులకు, వేలం కేంద్రాల్లో వస్తున్న ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. భారీగా పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఈ ఏడాది పొగాకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో వేలంలో సరైన ధరలు రాకపోవడం, నిత్యం వందల సంఖ్యలో బేళ్లను కొనుగోలు చేయకుండా వ్యాపారులు తిరస్కరిస్తుండటంతో సహనం నశించిన రైతులు తక్కువ ధరకు అమ్ముకోలేక పొగాకును తగులబెడుతున్నారు.

మందకొడిగా కొనుగోళ్లు

పశ్చిమ ప్రకాశంలో పొదిలి పొగాకు వేలం కేంద్రం పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, బేస్తవారపేట, కంభం, గిద్దలూరు, తర్లుపాడు, అర్ధవీడు, పెద్దారవీడు, కురిచేడు, మార్కాపురం మండలాలు ఉన్నాయి. మొత్తం 4,390 మంది రైతులు పొగాకును సాగు చేస్తున్నారు. 2,601 బ్యార్నీలు ఉండగా అధికారికంగా 8,534 హెక్టార్లలో పొగాకు సాగుచేయగా అనధికారికంగా మరో 2,497 హెక్టార్లలో సాగు చేశారు. మొత్తం 11.10 మిలియన్‌ కిలోల పొగాకును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు కొనుగోళ్లు మందకొడిగా సాగాయి. వేలంలో వ్యాపారులు కుమ్మక్కవడంతో పోటీ లేక రైతులకు అన్యాయం జరుగుతోంది.

ఏడాదిలో అంతా తారుమారు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పొగాకు పంటకు మంచి ధర లభించింది. కానీ ఏడాదిలో అంత తారుమారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కసారిగా ధరలు దిగజారిపోయాయి. గత ఏడాది కేజీ రూ.360 పైచిలుకు పలకగా ఈ ఏడాది గరిష్ట ధర రూ.280 మించి పలకలేదు. ఇక కనిష్ట ధరలు రోజు రోజుకు నేల చూపులు చూస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ హయాంలో మార్క్‌ఫెడ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగడంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొంది. దీంతో వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేయడంతో గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయి. రైతులకు కాసుల వర్షం కురిసింది. అదే ఉత్సాహంతో ఈ ఏడాది రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ వేలం ప్రారంభమైన రోజు నుంచి నేటి వరకు ధరలు రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నాయి. మార్కాపురం మండలంలోని కొండేపల్లి, మిట్టమీదిపల్లి, ఎల్‌బియస్‌ నగర్‌, వేములకోట,వేములపేట, తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం, కలుజువ్వలపాడు, చెన్నారెడ్డిపల్లి, తాడివారిపల్లి, తర్లుపాడు తదితర గ్రామాల్లో పొగాకు సాగుచేశారు.

పొగాకు తగులబెడుతున్న రైతులు

రోజులు గడుస్తున్నా ధరల్లో మార్పు రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాన్ని బహిష్కరించి పొగాకు బేళ్లను రోడ్డు మీదకు తీసుకువచ్చి తగులబెట్టి నిరసన తెలియజేస్తున్నారు. అయినా రైతుల గోడును ఆలకించే వారే కరువయ్యారు. రాచర్ల మండలం పలుగుంటిపల్లి గ్రామంలో పొగాకు రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక వారం క్రితం తగులబెట్టారు.

క్వింటాకు రూ.10 వేల వ్యతాసం

గత మూడేళ్లలో మంచి ధరలు రావడంతో ఈ ఏడాది ఎంతో ఆశతో 21 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. గతంతో పోలిస్తే పెట్టుబడులు భారీగా పెరిగాయి. ధర ఉంటే పెట్టుబడులు ఏంముందన్న ఆశతో ఉన్నాం. కానీ వేలం ప్రారంభం నుంచి రైతులను మోసం చేస్తున్నారు. గత ఏడాది రూ.36 వేలు పలికిన క్వింటా ఈ ఏడాది రూ.26 వేలకు కూడా కొనే పరిస్థితి లేదు. క్వింటాకు రూ.10 వేల తేడా ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతారు.

పెట్టుబడులు, గిట్టుబాటు ధరల మధ్య భారీ వ్యత్యాసం మందకొడిగా సాగుతున్న కొనుగోళ్లు నాడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఊహించని ధరలు కూటమి ప్రభుత్వంలో తిరగబడిన పరిస్థితులు

– రేగుల అంకయ్య, రైతు

ధరల కాటు!1
1/2

ధరల కాటు!

ధరల కాటు!2
2/2

ధరల కాటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement