
చిన్నారులను రక్షించిన వ్యక్తికి రివార్డు
కొమరోలు: తాటిచెర్లమోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి చేరుకున్న తాటిచెర్ల గ్రామానికి చెందిన పాశం బాలవెంకటరెడ్డి చిన్నారుల ఆర్తనాదాలు విని కారు వెనుక వైపు డోరు అద్దాలు పగులగొట్టాడు. చిన్నారులు జీతన్, శిరీషలను బయటకు తీసి వెంటనే గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు కృషి చేశాడు. ఈ విషయాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు దృష్టికి ఎస్సై నాగరాజు తీసుకెళ్లారు. బాలవెంకటరెడ్డికి డీఎస్పీ నగదు రివార్డును ప్రమాద స్థలంలో శనివారం అందించి అభినందించారు. బాలవెంకటరెడ్డి సాయం వెలకట్టలేనిదని కొనియాడారు. స్థానికులు కూడా ఆయన్ను అభినందించారు.