
గరుడ వాహనంపై విష్ణుమూర్తిగా చెన్నకేశవుడు
మార్కాపురం టౌన్: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి గరుడ వాహనోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున గరుడ వాహనంపై శ్రీమహావిష్ణువు అలంకారంలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడోత్సవం రోజున శ్రీ మహావిష్ణువు అలంకారంలో చెన్నకేశవస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. నగరోత్సవంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తల్లి కుందురు సుబ్బమ్మ, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మాజీ ఆలయ చైర్మన్ పి.కేశవరావు, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, పురప్రముఖులు, అధికారులు, ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
నేడు రథోత్సవం:
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి అత్యంత వైభవంగా రథోత్సవం సోమవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని జయప్రదం చేయాలని కోరారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు నేడు చెన్నకేశవుని రథోత్సవం

గరుడ వాహనంపై విష్ణుమూర్తిగా చెన్నకేశవుడు