
సాదా బైనామాలకు మోక్షం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్: రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాదాబైనామాలకు రాష్ట్ర ప్రభుత్వం మోక్షం కలిగించిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పూసాల, శాసీ్త్రనగర్లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ వల్ల ఇబ్బంది పడని రైతులెవరూ లేరని అన్నారు. 15 నెలల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా భూభారతి చట్టం ప్రవేశపట్టారని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి
పెద్దపల్లిరూరల్: రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం, అందుగులపల్లి గ్రామాల్లో గురువారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. నాయకులు ఆడెపు వెంకటేశం, చందశంకర్, గంట రమేశ్, సంతోష్, కందుల అశోక్, మల్లన్న తదితరులున్నారు.