
కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డు
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో కోవిడ్ ఎదుర్కొనే సన్నద్ధత చర్యలు చేపట్టలేదనే అంశంపై ‘కోవిడ్పై సన్నద్ధత శూన్యం..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురించిన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రిలో కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు తెలిపారు. వైద్యపరీక్షల నిర్వహణకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటుచేయడంతో పాటు మాక్ డ్రిల్ నిర్వహించారు.

కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డు