హక్కుల పోరుకు నెత్తుటి తిలకం | - | Sakshi
Sakshi News home page

హక్కుల పోరుకు నెత్తుటి తిలకం

May 1 2025 1:24 AM | Updated on May 1 2025 1:24 AM

హక్కు

హక్కుల పోరుకు నెత్తుటి తిలకం

కార్మిక పోరు ఫలించిన వేళ..!

శ్రమచేద్దాం..శ్రమను గుర్తిద్దాం..

శ్రమను గౌరవిద్దాం

గొడ్డు చాకిరీ నుంచి కార్మికులకు

విముక్తి కలిగిన రోజు

1886 మే 1 నుంచి 8గంటల

పని విధానం అమలు

నేడే మేడే

కార్మికులపై ప్రభుత్వాల దాడి

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వర్గంపై పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాయి. గత ప్రభుత్వంతో జరిగిన ఏ ఒక్క ఒప్పందాన్ని అమలు చేయడం లేదు. చిరుద్యోగులను, కార్మికులను రాజకీయ కారణాలతో తొలగిస్తున్నారు. పనిభారం పెరుగుతోంది. 8గంటల పనిదినం, కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు.కనీస వేతనాలు అమలు, బేరసారాలు ఆడే హక్కు, గ్రాట్యుటీ, బోనస్‌, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ వంటి చట్టబద్దమైన హక్కుల్ని నిరాకరించే 4 లేబర్‌ కోడ్‌ల అమలకు కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మే డే స్ఫూర్తితో 8 గంటల పనిదినాన్ని కాపాడుకుంటాం. లేబర్‌ కోడ్‌ల అమలును అడ్డుకుంటాం.

–సీఐటీయూ జిల్లా కార్యదర్మి ఎ.జగన్‌ మోహన్‌ రావు

విజయనగరం గంటస్తంభం: ప్రతి సంవత్సరం మే 1వ తేదీన మేడేను అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మేడే జరుపుకునేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆ రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం, సమాజానికి వారు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపునిచ్చి వారిని సన్మానించడం. కార్మిక దినోత్సవం మూలాలు 19వ శతాబ్దంలో కనిపిస్తాయి. అప్పుడు అమెరికాలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడారు. 1886, మే 1న దాదాపు 2లక్షల మంది కార్మికులు 8గంటల పనిదినాన్ని డిమాండ్‌ చేస్తూ భారీ సమ్మెకు దిగారు. అంతేకాకుండా చక్కటి పని వాతావరణాన్ని కల్పించడం, తక్కువ వేతనాలు, బాలకార్మికుల వంటి అంశాలపై కూడా పోరాటం చేశారు.

అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అటు ఐరోపా దేశాలకు కూడా పాకింది. షికాగోలో హిసాత్మకంగా మారింది. షికాగోలోని హే మార్కెట్‌ స్క్వేర్‌లో జరిగిన శాంతియుత సమావేశంలో బాంబు పేలడంతో ఈ ఘటన విషాదకరంగా మారింది. ఈ ఘటనలో ఇటు పోలీసులు అటు సమ్మెలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక చేసేదిలేక ప్రభుత్వం దిగొచ్చి 1894లో కార్మిక దినోత్సవం ఏర్పాటు చేస్తూ ఆరోజు సెలవుదినంగా ప్రకటించింది. 1916లో తొలిసారిగా రోజుకు 8 పని గంటలు మాత్రమే అన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

ఇక..భారత్‌లో మొదటిసారిగా 1923 మే 1వ తేదిన కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. మనదేశంలో ఇతర దేశాల కంటే ముందే కోల్‌కత్తాలో కార్మికుల పనిగంటల కోసం హౌరా రైల్వే స్టేషన్‌లో 1862లోనే సమ్మె చేశారు. 1923లో తొలిసారిగా భారత్‌ దేశంలో మేడేను పాటించారు. ఆ తర్వాత 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడడంతో అప్పటి నుంచి కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైంది. దీంతో మేడే పాటిస్తున్నారు.

కార్మిక సంక్షేమం కోసం..

సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి చిన్న కూలీ వరకూ నేడు సెలవును కచ్చితంగా పాటిస్తారు. ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమ కోసం అనేక పథకాలు ఈరోజు ప్రకటిస్తాయి. రాజకీయ పార్టీలు సైతం కార్మికులను ఆకట్టుకునేందుకు రేపటి వేదికలను తమకు అనుకూలంగా మార్చుకోవడం రొటీన్‌గా మారింది. అలాగే మే 1వ తేదీన తమకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని కార్మిక సంఘాలు కూడా ఆశిస్తుంటాయి.

కార్మికులకు పండగ రోజు

మే డే నాడు అనేక ఉద్యమాలు ప్రాణం పోసుకున్న సందర్భంలో కార్మికులు విజయోత్సవాలు కూడా ఏటా జరుపుకుంటూ వస్తున్నారు. కార్మిక సంఘాలు తమ వేతనాలు పెంచాలని, సంక్షేమ కార్యక్రమాల ను వేగవంతం చేయాలని, పెరుగుతున్న ధరలకు అ నుగుణంగా తమకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుతూ..ఆందోళనకు దిగుతాయి. మే 1వ తేదీన వారికి అనుకూలంగా కొంత ప్రకటనలు వచ్చే చాన్స్‌ లేకపోలేదు. అందుకే మే డే వస్తుందంటే కార్మికుడికి పండగలాంటిదే. కేవలం సెలవుదినంగానే వారు మే డేను చూడరు. తమకు ఆర్థిక స్వాతంత్య్రంతో పాటు వెట్టి చాకిరీని నుంచి విముక్తి కల్పించిన రోజుగానే భావించి కార్మికులందరూ ఒకచోట చేరి సంబరాలు చేసుకుంటారు. అదే మేడే ప్రత్యేకత.

సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి

సమానపనికి సమాన వేతనం చట్టాలు అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చడం, లాభాల్లో నడుస్తున్న రైల్వేలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, బొగ్గు పరిశ్రమ, విశాఖ ఉక్కు లాంటి 37 ప్రభుత్వరంగ పరిశ్రమలను దేశ ప్రజల ఆస్తులను ప్రైవేటీకరించడం లాంటి చర్యలు దుర్మార్గం. దేశాన్ని మతోన్మాదం వైపు మళ్లిస్తూ ఆర్థికంగా నాశనం చేస్తూ, అభివృద్ధిని అథఃపాతాళానికి తొక్కేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు మేము వ్యతిరేకం. అసంఘటిత కార్మికులకు కార్మిక చట్టాలు అమలు వంటి నినాదాలతో జిల్లాలో నేడు కార్మిక దినోత్సవం చేస్తున్నాం.

సీపీఐ విజయనగరం జిల్లా

నగర కార్యదర్మి బుగత అశోక్‌

దోపిడీదారులకు చౌకగా భూమి

దోపిడీ దారులైన టీసీఎస్‌, ఉర్సా కంపెనీలకు ఎకరా భూమి 99పైసలకే ఇవ్వడం దుర్మార్గం. భవననిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నాం. కార్మికుల సహకారాన్ని గుర్తుచేయడమే కాకుండా.. కార్మికుల హక్కులను గుర్తుచేస్తూ..సమాజానికి వారు చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. –సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు

హక్కుల పోరుకు నెత్తుటి తిలకం1
1/3

హక్కుల పోరుకు నెత్తుటి తిలకం

హక్కుల పోరుకు నెత్తుటి తిలకం2
2/3

హక్కుల పోరుకు నెత్తుటి తిలకం

హక్కుల పోరుకు నెత్తుటి తిలకం3
3/3

హక్కుల పోరుకు నెత్తుటి తిలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement