
మెకానిక్ ముసుగులో ద్విచక్ర వాహనాలు చోరీ
గుంటూరు రూరల్: చెడు వ్యసనాలకు బానిసలై చోరీలను పాల్పడుతున్న ఇరువురిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశఽంలో సౌత్ జోన్ డీఎస్పీ భానోదయ తెలిపిన వివరాల ప్రకారం గోరంట్ల గ్రామానికి చెందిన పరిమిశెట్టి లక్ష్మణ్ ఆటోడ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతనికి పాతగుంటూరుకు చెందిన పాత నేరస్తుడు బైక్ మెకానిక్గా పనిచేసే చల్లా అంజిబాబు పరిచయమయ్యాడు. దీంతో ఇరువురు కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు ద్విచక్ర వాహనాలను చోరీ చేయటం ప్రారంభించారు. ఇరువురు పాత నేరస్తులే.. గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రులు, పార్కులు, ఇతర రద్దీగా ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేసే వాహనాలను, తాళాలు వేయని వాహనాలను గుర్తించి చోరీలకు పాల్పడేవారు. ఈక్రమంలో ఈనెల 1వ తేదీన గోరంట్ల ఇన్నర్ రింగ్రోడ్డులోని విజయశ్రీ ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని ఇరువురు చోరీ చేశారు. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నల్లపాడు సీఐ వంశీధర్ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను ఆదవారం నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరాలను ఒప్పకున్నారు. నిందితులు 2012 నుంచి నేర ప్రవృత్తిని కలిగి ఉన్నారని విచారణలో తెలిందన్నారు. నిందితుల వద్దనుంచి రూ.13లక్షల విలువ చేసే 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు చేధించటంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐ జనార్థన్లను జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టుకు అప్పగించారు.
ఇద్దరు బైక్ చోరీల నిందితులు అరెస్టు 22 వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ భానోదయ