
అర్జీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించండి
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర 63 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు