నాటకరంగ అభివృద్ధికి పరిషత్‌ల కృషి ఎనలేనిది | - | Sakshi
Sakshi News home page

నాటకరంగ అభివృద్ధికి పరిషత్‌ల కృషి ఎనలేనిది

May 29 2025 7:29 AM | Updated on May 29 2025 7:29 AM

నాటకరంగ అభివృద్ధికి పరిషత్‌ల కృషి ఎనలేనిది

నాటకరంగ అభివృద్ధికి పరిషత్‌ల కృషి ఎనలేనిది

నాదెండ్ల: తెలుగు నాటక రంగాభివృద్ధికి కళాపరిషత్‌లు చేస్తున్న కృషి అభినందనీయమని సినీ, సీరియల్‌ నటుడు, పుచ్చలపల్లి సుందరయ్య కళాపరిషత్‌ అధ్యక్షుడు ముత్తవరపు సురేష్‌బాబు చెప్పారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ తృతీయ జాతీయస్థాయి నాటిక పోటీలు గురువారం ఐదో రోజు కొనసాగాయి. సభాధ్యక్షుడిగా బండారుపల్లి సత్యనారాయణ వ్యవహరించగా, ముఖ్యఅతిథులుగా రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, వరగాని కళాపరిషత్‌ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు, లింగారావుపాలెం కొండవీడు కళాపరిషత్‌ అధ్యక్షుడు కట్టా శ్రీహరిరావు, కట్రపాడు ఉషోదయ కళానికేతన్‌ అధ్యక్షుడు చెరుకూరి సాంబశివరావు పాల్గొన్నారు. ముత్తవరపు మాట్లాడుతూ తెలుగు నాటక రంగాన్ని నిలబెట్టేందుకు జూన్‌ మాసంలో జాతీయస్థాయిలో సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం కన్నాంబ అవార్డు గ్రహీత ఎస్‌.అమృతవర్షిణి, ముత్తవరపు సురేష్‌, అరుణకుమారి దంపతులను కళాపరిషత్‌ సభ్యులు, అతిథులు శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో పాండురంగారావు, నాగమల్లి, రామారావు, పెద్దబ్బాయి, పరిషత్‌ నిర్వాహకుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు...

తాడేపల్లి అరవింద ఆర్ట్స్‌వారి ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్‌వారి ‘ఎవరు’ కట్రపాడు ఉషోదయ కళానికేతన్‌వారి ‘కిడ్నాప్‌’ నాటకాలు పేరక్షకులను అలరించాయి.

సినీ, సీరియల్‌ నటుడు ముత్తవరపు సురేష్‌బాబు నేటితో ముగియనున్న జాతీయస్థాయి నాటికల పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement