
యోగాతో ఆరోగ్యం.. ఉల్లాసం
నరసరావుపేట రూరల్: యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమలో భాగంగా ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో బుధవారం యోగా శిక్షణా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారి మురళీతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరజ్ మాట్లాడుతూ యోగా వలన ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. దీంతో పాటు కొన్ని శారీరక రుగ్మతలు దూరం అవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగా సాధనను అలవర్చుకొని ఆయుష్షును పెంచుకోవాలని సూచించారు. పవిత్రమైన కోటప్పకొండపై యోగా శిక్షణను ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు.
జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే
కోటప్పకొండలో యోగాంధ్ర

యోగాతో ఆరోగ్యం.. ఉల్లాసం