
శ్రీకృష్ణ తలభారం
పల్నాడు
మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
అరటిపండ్లతో విశేష పూజలు
సత్తెనపల్లి: సత్తెనపల్లి నాగన్నకుంటలోని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం అరటిపండ్లతో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. 108 రకాల ప్రసాదాల నివేదన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 514.40 అడుగుల వద్ద ఉంది. ఇది 139.2626 టీఎంసీలకు సమానం.
విఘ్నేశ్వరునికి పూజలు
పెదకూరపాడు: పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు సోమవారం పూజలు చేశారు. లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.
30న పాలిసెట్ ప్రవేశ పరీక్ష
జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు
నరసరావుపేట ఈస్ట్/నరసరావుపేట: పల్నాడుజిల్లా పరిధిలోని నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల మూడు పట్టణ కేంద్రాల పరిధిలోని 12 పరీక్షా కేంద్రాలలో ఈనెల 30వ తేదీన పాలీసెట్–2025 పరీక్ష నిర్వహిస్తున్నట్టు సెట్ జిల్లా కో–ఆర్డినేటర్ బి.వి.రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కేంద్రాలలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 11గంటల తరువాత వచ్చిన అభ్యర్థులను కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఉదయం 10గంటలకే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. పాలిసెట్కు దరఖాస్తు చేసుకొని ఉండి హల్టికెట్లు పొందని విద్యార్థులు తమ దరఖాస్తు నకలుతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 10వ తరగతి హాల్టికెట్ (ఎస్ఎస్సీ)తో ఈనెల 29వ తేదీన తమ పరిధిలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల (పల్నాడురోడ్డు, నరసరావుపేట 9398421968 ), చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాల (గణపవరం, చిలకలూరిపేట, ఎన్.హెచ్ 16, 9912342063 ), కిడ్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, (కొత్త కేసీపీ కాలనీ, మాచర్ల, 9440613009 ) కేంద్రాలలో సంప్రదించాలని సూచించారు.
సాక్షి, టాస్క్ఫోర్స్: పల్నాడు రాజకీయాల్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సరికొత్త భాష్యానికి తెర తీశారు. మామూలుగా పల్నాడు రాజకీయాలంటే ప్రతీకారాలు, ప్రత్యక్ష యుద్ధాలు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అడుగుపెట్టాక కొత్తకోణాన్ని పల్నాడు రాజకీయాలకు పరిచయం చేశాడు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశాడు. తాను అనుకున్నదే జరగాలనే ఒంటెత్తు పోకడలతో కేడర్ మధ్య చిచ్చు పెట్టారు. ఇలా తన రాజకీయ ప్రస్తానంలో పైకి సౌమ్యుడిలా.. లోన కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు.
వర్గపోరుకు కేరాఫ్..
గతంలో వైఎస్సార్ సీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీలో వర్గ పోరు కొనసాగించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రజిని, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో విభేదాలు ఉండేవి. గురజాలలో కాసు మహేష్రెడ్డికి పక్కలో బల్లెంలా మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణామూర్తిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రూప్ రాజకీయాలను పెంచిపోషించాడన్న అపవాదు మూటకట్టుకున్నాడు. మిగిలిన నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ పైకి స్నేహపూర్వకంగా ఉన్నట్టు నటిస్తూ అంటీముట్టనట్లు వ్యవహరించే వారు. తనకంటూ అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక వర్గాన్ని పెంచి పోషించేవారు.
అందుకే జగన్ పక్కన పెట్టేశారు..
వైఎస్సార్ సీపీలో చేరిన శ్రీకృష్ణదేవరాయలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయాల్లో యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఇచ్చారు. అక్కడ గెలుపొందిన శ్రీకృష్ణదేవరాయలు మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, ఎమ్మెల్యేలంతా తన తర్వాతే అనే ధోరణిలో వ్యవహరించే వారు. ఇది అప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఈ విషయాలపై శ్రీకృష్ణదేవరాయలును వైఎస్ జగన్మోహన్రెడ్డి సున్నితంగా మందలించారని కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి రజిని బహిరంగంగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా శ్రీకృష్ణదేవరాయలు ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని మీడియా ముఖంగా మాజీ మంత్రి విడదల రజిని కుండబద్దలు కొట్టారు. దీనిపై స్పందించిన ఎంపీ.. నాలుగు ముక్కలు చెప్పి వేరే విషయాలు మాట్లాడి చేతులు దులుపుకొన్నారని, దీటైన జవాబు ఇవ్వలేకపోయాడని తెలుగుదేశం పార్టీ వర్గాలే పెదవి విరిచాయి. తనను ఎంపీగా గెలిపించిన పార్టీ, ఎమ్మెల్యేలకు మోసం చేయడంతోనే వైఎస్సార్ సీపీ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కన పెట్టేశారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తలనొప్పి మాకు తగులుకుందని వాపోతున్నారు.
7
టీడీపీలోనూ అదే పంథా..
కూటమి తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా రెండోసారి గెలిచారు. ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో గ్రూపు రాజకీయాలు నడిపారు. టీడీపీలోకి చేరే సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టిమరి కండువా కప్పుకున్నారని సమాచారం. అందులో భాగంగా గురజాలలో జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించి యరపతినేనికి టికెట్ రానీయకుండా పావులు కదిపారనే ప్రచారం నడిచింది.
నరసరావుపేటలో బీసీ అభ్యర్థి అరవింద్ బాబుకు చివర వరకు బీఫారం రాకుండా అడ్డుకున్నారు. జనసేన నేత జిలాని, కొంతమంది టీడీపీ నేతలతో జట్టు కట్టి అక్కడ కుట్రలకు తెర తీశారు. ఆ సమయంలోనే అరవింద్ బాబు, శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు పొడచూపి బహిరంగంగా తిట్టుకొనే వరకు వెళ్లాయి. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావొస్తున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు.
ఇక చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావును కాదని మర్రి రాజశేఖర్ వర్గాన్ని ఆదరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మర్రి రాజశేఖర్కే పేట ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఎంపీ హామీ ఇచ్చారన్న ప్రచారంతో పత్తిపాటి వర్గం గుర్రుగా ఉంది.
వినుకొండలో తనతోపాటు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే మక్కెనను ఎంపీ ప్రాధాన్యత ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. గతంలో బొల్లాకు ఇలానే తలనొప్పి తెప్పించారని గుర్తుచేసుకుంటున్నారు.
మాచర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి వ్యతిరేకంగా సొంతపార్టీలోనే మరో గ్రూపు కడుతున్నారు. ఈ వర్గం ద్వారా బ్రహ్మారెడ్డికి ఇక్కట్లు తీసుకొస్తున్నారు. వైఎస్సార్ సీపీలో వర్గ రాజకీయాలు చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరిన తర్వాత అదే పంథా కొనసాగిస్తున్నారు. నచ్చిన వారు ఎన్ని తప్పులు చేసినా అందలమెక్కిస్తారని, నచ్చకపోతే వారిని అధఃపాతాళానికి తొక్కుతారనే విమర్శలు ఉన్నాయి.
న్యూస్రీల్
పల్నాడు జిల్లా తెలుగుదేశం
పార్టీలో లుకలుకలు
ఎంపీ తీరుతో ఎమ్మెల్యేల అసంతృప్తి
పైకి హుందాతనం.. లోన మోనార్కిజం
ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు
తలలు పట్టుకుంటున్న అధికార
పార్టీ నేతలు
వైఎస్ జగన్ అందుకే
గెంటేశారంటున్న తెలుగు తమ్ముళ్లు
తీరు మారకపోతే పార్టీ
కార్యక్రమాలకు పిలవబోమని
హెచ్చరికలు

శ్రీకృష్ణ తలభారం

శ్రీకృష్ణ తలభారం

శ్రీకృష్ణ తలభారం

శ్రీకృష్ణ తలభారం