
డ్వాక్రా సంఘంలో రూ.3 లక్షలు గోల్మాల్
సోంపేట: మండలంలోని గొల్లూరు పంచాయతీలోని గనగాలమ్మ ఎస్హెచ్జీ గ్రూప్ లో సుమారు రూ.3 లక్షలు గోల్మాల్ అయినట్లు సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రూపు సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గనగాలమ్మ గ్రూప్ సభ్యులు బారువ స్టేట్ బ్యాంక్లో బ్యాంక్ లింకేజి ద్వారా రూ.పదిలక్షల రుణం తీసుకున్నారు. అయితే సంఘ ఆర్గనైజర్ గజ్జి ఊర్వశి గత కొన్ని నెలలుగా సంఘ సభ్యుల వద్ద నుంచి సుమారు రూ.3 లక్షలు బ్యాంకుకు కడతానని తీసుకుని సొంత అవసరాలకు వాడుకున్నారు. ఆ డబ్బు బ్యాంకుకు కట్టలేదు. బ్యాంకు అఽధికారులు గ్రూపు సభ్యులను నిలదీయడంతో ఆర్గనైజర్ గోల్మాల్ వ్యవహారం బయటపడింది. దీంతో గనగాలమ్మ గ్రూప్ సభ్యులు గ్రామ సంఘం వీఓఏ వంకల మోహనరావును అడిగారు. దీంతో ఆర్గనైజర్ను బ్యాంకు లింకేజీ కట్టమని వీఓఏ చెప్పారు. అయితే డబ్బు వాడుకుని ఐదారు నెలలు గా చెల్లించకపోయినా వీఓఏ గ్రూపు సభ్యులకు తెలియజేయక పోవడం గమనార్హం. దీంతో గ్రూపు సభ్యులు బారువ పోలీసులను ఆశ్రయించారు. ఆర్గనైజర్ భర్త అధికార పార్టీ నాయకుడు కావడంతో ఓ నియోజకవర్గ నాయకుడు కేసు ను సద్దుమణిగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బారువ పోలీసులు సంఘ సభ్యులను సముదాయించి గోల్మా ల్ చేసిన నిధులు ఆర్గనైజర్ చెల్లిస్తారని హామీ ఇవ్వడంతో గ్రూప్ సభ్యులు వెనుదిరిగారు. అయితే ని ధులు గోల్మాల్ చేసిన ఆర్గనైజర్పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గ్రామానికి చెందిన ఇంకో సంఘంలోనూ ఇలాగే జరిగింది. విషయం బయటకు రావడంతో డబ్బు చెల్లించారు.