
21 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్టు
రాయగడ: అబ్కారీ, రైల్వే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనితో సంబంధం ఉన్న ఇద్దరి నిందితులను అరెస్టు చేశారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో ముంబాయికి గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు అబ్కారీ సిబ్బంది, రైల్వే పోలీసులు దాడులను నిర్వహించినట్లు అబ్కారీ శాఖ అధికారి సంతోష్ కుమార్ దళ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. రెండు లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు.