
విజిలెన్స్ వలలో ఏఎస్ఐ
● రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
రాయగడ: పది వేల రుపాయల లంచం తీసుకుంటూ విజిలెన్స్ వలకు చిక్కారు బరంపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బబిత సునా. ఓ కేసుకు సంబంధించి మహిళను బరంపురం మహిళా పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసి ఉంచారు. ఈ కేసును బబిత విచారిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే అందుకు రూ.10 వేలు చెల్లించాలని, లేదంటే వేరే కేసులపై అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని బబిత చెప్పారు. బాధితురాలు ఈ మేరకు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. వల పన్నిన విజిలెన్స్శాఖ అధికారులు ఏఎస్ఐ లంచం తీసుకుంటుండగా బుధవారం పట్టుకున్నారు. ఆమైపె కేసు నమోదు చేశారు.