విజిలెన్స్‌ వలలో ఏఎస్‌ఐ | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ వలలో ఏఎస్‌ఐ

Jun 5 2025 10:47 AM | Updated on Jun 5 2025 10:47 AM

విజిలెన్స్‌ వలలో ఏఎస్‌ఐ

విజిలెన్స్‌ వలలో ఏఎస్‌ఐ

● రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

రాయగడ: పది వేల రుపాయల లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ వలకు చిక్కారు బరంపురం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న బబిత సునా. ఓ కేసుకు సంబంధించి మహిళను బరంపురం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో అరెస్టు చేసి ఉంచారు. ఈ కేసును బబిత విచారిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే అందుకు రూ.10 వేలు చెల్లించాలని, లేదంటే వేరే కేసులపై అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందని బబిత చెప్పారు. బాధితురాలు ఈ మేరకు విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించాడు. వల పన్నిన విజిలెన్స్‌శాఖ అధికారులు ఏఎస్‌ఐ లంచం తీసుకుంటుండగా బుధవారం పట్టుకున్నారు. ఆమైపె కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement