
ఘనంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం
జయపురం: పట్టణంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం ఘనంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక సోనీ సైకిల్ మార్టు వారి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మొదట రఘనాథ్ మందిరం వద్దకు చేరిన సైకిలిస్టులు, అక్కడ నుంచి 26వ జాతీయ రహదారి పాత బస్టాండ్ ప్రధాన జంక్షన్ వద్దకు వెళ్లారు. అక్కడ నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ వల్లభాయి పటేల్ మార్గం మీదుగా రథోపొడియ కూడలికి చేరింది.
సైక్లింగ్ వలన కలిగే ప్రయోజనాలు తెలియజేసేందుకు కృషి చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త మోహనరావు వెల్లడించారు. సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యం పొందవచ్చన్నారు.