
నీటికుంటలో పడి బాలుడు మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలోని ఖోయిర్పూట్ సమితి ఆండ్రాహల్ పంచాయతీ కాతామీగడ గ్రామంలో నీటికుంటలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సంతోష్ కావాతి(3) తోటి పిల్లలతో కలిసి నీటికుంట దగ్గర స్నానానికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోవడం జరిగింది. సమీపంలో ఉన్నవారు బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ముదిలిపోడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగించనున్నారు.

నీటికుంటలో పడి బాలుడు మృతి