
ఊపందుకున్న రథాల పనులు
పర్లాకిమిడి: జగన్నాథ రథయాత్ర కోసం పట్టణంలోని రాజవీధిలో మూడు రథాల తయారీ పనులు ఊపందుకున్నాయి. కాశీనగర్ బ్లాక్ సింగిపురం నుంచి పది మంది వడ్రంగులు, పర్లాకిమిడి నుంచి మరో ఐదుగురిని ప్రస్తుతం నియమించినట్టు రథయాత్ర రథాల కమిటీ తెలియజేశారు. జగన్నాథ, బలభధ్ర, సుభధ్ర రథాలు తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. మూడు రథాల తయారీకి ప్రస్తుతం పనులు జరుగుతుండగా అవసరమైన నూతన కలప ఫారెస్టు అధికారులు సమకూర్చుతున్నట్టు రథాల కిరిగోరో అశోక్ మహారాణా తెలియజేశారు. వర్షాలు ఆటంకం లేకుండా వుంటే, ఈ మూడు రథాల పనులు జూన్ 26 తేదీకు ముందు పనులు పూర్తవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
రథ చక్రాల పనుల్లో నిమగ్నమైన వడ్రంగులు
కొత్త శ్రీమందిరం పనులు కూడా సాగుతున్న వైనం

ఊపందుకున్న రథాల పనులు

ఊపందుకున్న రథాల పనులు

ఊపందుకున్న రథాల పనులు