
ఈ ఏడాదే కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
జయపురం: జయంపురం పట్టణ ప్రజలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలకు ఆసక్తి ఉన్నవారి వివరాలు నమోదు ప్రారంభించాలని అధికారులు వెల్లడించారు. జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఇంటిగ్రేటెడ్ ట్రైబుల్ డవలప్మెంట్ ఏజన్సీ(ఐటీడీఏ) భవనంలో కేంద్ర విద్యాలయాన్ని ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు అందిన వెంటనే మీడియాకు తెలియజేయనున్నట్లు కొరాపుట్ కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్ సరోజ్ కుమార్ దాస్ వెల్లడించారు. వాస్తవంగా 2024 డిసెంబర్లో జయపురం కేంద్ర విద్యాలయం ప్రారంభం కానున్నదని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో ప్రకటించారు. 2025–26 విద్యా సంవత్నంలోవి ద్యాబోధన ప్రారంభ మౌతుందని ప్రకటించారు. కేంద్ర విద్యాలయం ప్రారంభానికి తేదీ నిర్ణయించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్గా ప్రారంభిస్తారని సంబంధిత అధికారులు ప్రకటించారు. అందుకు జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాట్లు ప్రారంభించారు. అకస్మాత్తుగా కేంద్ర మంత్రి అమిత్షా ఒడిశా పర్యటన రద్దు కావటంతో కేంద్రవిద్యాలయ ప్రారంభోత్సవం రద్దు అయింది. అప్పటి నుంచి కేంద్ర విద్యాలయంలో తమ పిల్లల పేర్లు నమోదు చేసేందుకు ఎదురు చూశారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరచి అడ్మిషన్లు ప్రారంభం కావటంతో కేంద్ర విద్యాలయంపై ఆశలు వదులుకున్న తల్లిదండ్రులు నిరాశ చెంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లల పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంతలో ఏ ఏడాది నుంచే కేంద్రీయ విద్యాలయం ప్రారంభమౌతుందని.. అడ్మిషన్లకు పేర్లు నమోదు చేసుకోవచ్చని విజ్ఞప్తి వెల్లడి కావటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆనందం వ్యక్తం చేస్తున్న జయపురం వాసులు