● జర్నలిస్టుల నిరసన | - | Sakshi
Sakshi News home page

● జర్నలిస్టుల నిరసన

May 28 2025 12:22 AM | Updated on May 28 2025 12:22 AM

● జర్

● జర్నలిస్టుల నిరసన

పర్లాకిమిడి: ఒడిశా రాష్ట్రంలోని బలంఘీర్‌ జిల్లా పుయితోలా పీఎస్‌ పరిధి కులోత్పా పట్టణంలో ‘బోడోఖబర్‌’ ఒడియా దినపత్రిక పాత్రికేయుడు బిజయ ప్రధాన్‌ను కాళ్లు, చేతులు కట్టివేసి అమానుషంగా కొట్టిన ఘటనపై యావత్‌ ఒడిశా రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌ గేటు వద్ద ఉత్కళ జర్నలిస్టుల సంఘం సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఫాల్గుణ మఝిని కలిసి సీఎం పేరిట రాసిన వినతిని అందజేశారు. పాత్రికేయుడిని కొట్టినవారిని వెంటనే అరెస్టు చేయాలని, ఒడిశాలో జర్నలిస్టుల సురక్షా చట్టం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉత్కళ జర్నలిస్టుల సంఘం గజపతి జిల్లా అధ్యక్షుడు బిధాన్‌ చౌదరి, కార్యదర్శి ప్రదీప్‌ నాయక్‌, ద్విజేంద్రనాథ్‌ పాఢి తదితరులు పాల్గొన్నారు.

● జర్నలిస్టుల నిరసన1
1/1

● జర్నలిస్టుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement