
పార్టీ శ్రేణులతో పీసీసీ చీఫ్ భేటీ
జయపురం: రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భక్త చరణ దాస్ శనివారం సాయంత్రం కొరాపుట్ వచ్చారు. పొట్టగి ఎమ్మెల్యే, విధాన సభలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు రామ చంధర కడమ్ కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కొరాపుట్ సర్క్యూట్ హౌస్లో జిల్లా పార్టీ నాయకులతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించినట్లు తెలిసింది. సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెసస్ అధ్యక్షురాలు మీణాక్షీ బాహిణీపతి, మల్కన్గిరి మాజీ ఎమ్మెల్యే నిమ్మయిచరణ సర్కార్, రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకులు అజయ లల్లూ, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత తదితరులు పాల్గొన్నారు. భక్త చరణ దాస్ పీసీసీ అధ్యక్షులుగా నియమితులైన తరువాత మొదటి సారిగా కొరాపుట్ వచ్చిన సందర్భంగా ఆయనకు ప్రార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.