
ఆమరణ నిరాహార దీక్ష విరమణ
పర్లాకిమిడి: స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద గత నాలుగు రోజులుగా వివిధ డిమాండ్లపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బస్తీ సురక్షా మంచ్ శనివారం ఉదయం ఆదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫల్గుణ మఝితో జరిపిన చర్చలలు ఫలప్రదం కావడంతో ఆందోళన విరమించారు. 14వ వార్డు సంజయ్ గాంధీ కాలనీ వాసులకు బెత్తగుడ వద్ద ఏడుగురుకి ఇళ్ల పట్టా మంజూరు, కాలనీలో స్వస్థ్య, తాగునీరు సరఫరా ఐదు రోజుల్లో పరిష్కరిస్తామని, ఇళ్లు లేని నిరుపేదలకు బిజూ జాగా మిషన్ ద్వారా బెత్తగుడ వద్ద పట్టాలు మంజూరు చేస్తామని ఏడీఎం ఫల్గుణ మఝి అంగీకరించారు. దీనికి బస్తీ సురక్షా మంచ్ నాయకుడు సుజిత ప్రధాన్ అంగీకరించడంతో బస్తీవాసులు నిరాహార దీక్షను విరమించారు. ఈ చర్చల్లో పురపాలక సంఘం చైర్పర్సన్ నిర్మలా శెఠి, ఈఓ లక్ష్మణ ముర్ము, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా అధ్యక్షుడు పైల మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.