
● ఏడాదిలో దిగజారిన వైద్య సేవలు ● పల్లెల్లో వైద్యం మిథ్య
రోగుల బారులు.. విజయవాడ జీజీహెచ్లో మందుల కోసం క్యూ కట్టిన రోగులు(ఫైల్)
దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమానికి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది. మారుమూల గ్రామాలకు సైతం 104 వాహనంలో కుటుంబ డాక్టర్(ఫ్యామిలీ ఫిజీషియన్) కార్యక్రమం ద్వారా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెళ్లి వైద్య సేవలు అందించే వారు. ఇప్పుడు అవి పడకేశాయి. గతంలో ప్రతి గ్రామాన్ని మ్యాపింగ్ చేసి, ఎంపిక చేసిన తేదీల్లో కచ్చితంగా వైద్యులు, సిబ్బంది వెళ్లి సేవలు అందించేవారు. నడవలేని స్థితిలో మంచాన ఉన్న రోగుల ఇళ్లకే వెళ్లి వైద్యులు చూసేవారు. ఇప్పుడు అవేమి లేవు. గ్రామాల్లో ఉండే విలేజ్ హెల్త్ క్లినిక్లు సైతం నిర్వీర్యమయ్యాయి.
దేశంలోనే తొలిసారిగా గత ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా స్పెషలిస్టు వైద్యులనే గ్రామాలకు పంపించి వైద్య పరీక్షలు చేసి ప్రజలకు భరోసా కల్పించింది. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్, జనరల్ సర్జరీ ఇలా పలు విభాగాలకు చెందిన వైద్యులు గ్రామాలకే వెళ్లి సేవలు అందించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి ఉంటే మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్కు తరలించేవారు. ఆ రోగి జీజీహెచ్కు వెళ్లి చికిత్స పొంది డిశ్చార్జి అయ్యే వరకూ ఆరోగ్య సిబ్బంది ఫాలో అప్ చేస్తూ ఉండేవారు. అంతేకాక ఆ శిబిరాల్లో అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించేవారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, హైపోథైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ నేడు ఆ కార్యక్రమం నిలిచిపోయింది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు మందులు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
గత ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రికి వెళ్తే నాణ్యమైన సేవలు అందుతాయనే నమ్మకం కలిగించారు. ప్రస్తుతం ఆ నమ్మకం సన్నగిల్లింది. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండటం లేదు. రక్తపరీక్షలు సైతం ప్రైవేటు ల్యాబ్స్లో చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గుండె ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక ఆపరేషన్ థియేటర్ నిరుపయోగంగా మారింది. పక్షవాతం రోగులను చూసే న్యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్ లేని పరిస్థితి నెలకొంది. ప్రతి సూపర్స్పెషాలిటీ విభాగంలోనూ వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో గతంలో నిత్యం 3,200 నుంచి 3,500 వరకూ వచ్చే ఓపీ రోగులు నేడు 2,600లకు తగ్గారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని మళ్లీ గుంటూరుకు పంపించేస్తున్నారు.
నిలిచిన నిర్మాణాలు..
ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో పాటు, ప్రభుత్వాస్పత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందేలా పలు నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నాడు–నేడు పథకంలో రూ.170 కోట్లతో పలు భవన నిర్మాణాలు ప్రారంభమై 40 శాతంపైగా పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కుట్రపూరితంగా నిలిపివేసింది. అత్యాధునిక క్యాజువాలిటీ నిర్మాణం 80 శాతం పనులు పూర్తి చేసుకున్నా దానిని నిలిపేశారు.
ఇంటికి రానంటున్న ‘ఫ్యామిలీ డాక్టర్’
ఆరోగ్య సురక్షకు మంగళం..
పెద్దాస్పత్రిపై నమ్మకం పోయింది..

● ఏడాదిలో దిగజారిన వైద్య సేవలు ● పల్లెల్లో వైద్యం మిథ్య

● ఏడాదిలో దిగజారిన వైద్య సేవలు ● పల్లెల్లో వైద్యం మిథ్య

● ఏడాదిలో దిగజారిన వైద్య సేవలు ● పల్లెల్లో వైద్యం మిథ్య

● ఏడాదిలో దిగజారిన వైద్య సేవలు ● పల్లెల్లో వైద్యం మిథ్య

● ఏడాదిలో దిగజారిన వైద్య సేవలు ● పల్లెల్లో వైద్యం మిథ్య