పెరిగిన దుర్గమ్మ హుండీ కానుకల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన దుర్గమ్మ హుండీ కానుకల ఆదాయం

Jun 6 2025 1:02 AM | Updated on Jun 7 2025 2:41 PM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, వివాహ సుముహూర్తాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల హుండీ కానుకల ఆదాయం గణనీయంగా పెరిగింది. 22 రోజులకు గాను రూ. 4.11 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను గురువారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 22 రోజులకు గాను రూ. 4,11,96,190 నగదు, 394 గ్రాముల బంగారం, 8.010 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. కానుకల లెక్కింపును ఈవోతో పాటు దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించగా, సేవా సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు.

ఫిషింగ్‌ హార్బర్‌ సందర్శన

మచిలీపట్నంటౌన్‌: నగర శివారులోని గిలకలదిండి సముద్ర తీరాన నిర్మాణంలో ఉన్న ఫిషింగ్‌ హార్పర్‌ను వైఎస్సార్‌ సీపీ నాయకులు గురువారం సందర్శించారు. రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌, కార్పోరేటర్‌ తిరుమలశెట్టి వరప్రసాద్‌ తదితరులు ప్రత్యేక మర పడవలో ప్రయాణించి హార్బర్‌ను సందర్శించారు.

పాఠ్యపుస్తకాలను పరిశీలించిన అబ్జర్వర్లు

నున్న(విజయవాడ రూరల్‌): నున్న గ్రామం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ స్టాక్‌ పాయింట్‌లోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్‌ల రాష్ట్ర పరిశీలకులు ఎ.కృష్ణమోహన్‌, జిల్లా సీఎంఓ ఎన్‌.చంద్రశేఖర్‌, ఐఈడీ కోఆర్డినేటర్‌ ఎల్‌. వెంకటేశ్వరరావు పరిశీలించారు. పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు విద్యార్థి కిట్లు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, డిక్షనరీలు వచ్చాయని చెప్పారు.

16 మందికి హెడ్‌ నర్సులుగా ఉద్యోగోన్నతి

గుంటూరు మెడికల్‌: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్‌ నర్సులుగా పని చేస్తున్న 16 మందికి గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహించి హెడ్‌ నర్సులుగా ప్రమోషన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు ప్రాంతీ య వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్‌కు 17 మంది స్టాఫ్‌ నర్సులను ప్రమోషన్‌ కోసం పిలవగా, ఒకరు ప్రమోషన్‌ వద్దని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. ప్రమోషన్‌ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో ఎనిమిది మంది, ఒంగోలు జీజీహెచ్‌లో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు హెడ్‌ నర్సులుగా చేరారు. 

సుమారు ఆరు నెలలుగా ప్రమోషన్‌ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్‌ సిబ్బంది ఎట్టకేలకు కౌన్సెలింగ్‌ జరగడంతో నర్సింగ్‌ యూనియన్‌ నేతలతో కలిసి గురువారం మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుచిత్రాదేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఆర్డీతోపాటు, డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ షేక్‌ నాగూర్‌ షరీఫ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సుబ్బారావు పాల్గొన్నారు. ఆర్డీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా సెక్రటరీ వెల్లంపల్లి పద్మజ, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు సునీత, అరుణ ఉన్నారు.

పెరిగిన దుర్గమ్మ హుండీ కానుకల ఆదాయం 1
1/1

పెరిగిన దుర్గమ్మ హుండీ కానుకల ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement