
ఆరోగ్య కార్యక్రమాలేవి..
గత ప్రభుత్వంలో ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష పేరుతో నిత్యం వైద్యులు, స్పెషలిస్టు వైద్యులు గ్రామాల్లోనే ఉండేవారు. రోగులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చేవాళ్లు. మంచంలో ఉన్న వారిని గుర్తించి వారి వద్దకే వెళ్లి పరీక్షలు చేసే వారు. ఇప్పుడు అవన్నీ నిలిచి పోయాయి. రోగులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడో సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
– చల్లా సుశీల షేర్ మహ్మద్ పేట, జగ్గయ్యపేట మండలం