
మందులు సరిగా ఇవ్వడం లేదు..
ప్రభుత్వాస్పత్రుల్లో సరిగా మందులు కూడా ఇవ్వడం లేదు. గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి కాలనీలకే వచ్చి వైద్యుల పరీక్షలు జరపడంతో పాటు, అవసరమైన మందులు అన్నీ ఇచ్చే వాళ్లు. ఇప్పుడు సుగర్, బీపీ మందులు కావాలంటే ప్రభుత్వాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ గతంలో నెల రోజులకు ఇచ్చే వారు. ఇప్పుడు పదిహేను రోజులకు ఇవ్వడంతో నెలలో రెండు సార్లు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– కె. విజయలక్ష్మి, ఏపీఐఐసీ కాలనీ, విజయవాడ