రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Jun 5 2025 8:10 AM | Updated on Jun 5 2025 8:10 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

జి.కొండూరు: బైకుపై వెళ్తూ గేదెను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా తాడికొండ మండలం దామరపల్లికి చెందిన వీసా రాజేష్‌(26) గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ క్యాటరింగ్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులను చూసేందుకు సొంత గ్రామానికి వెళ్లిన రాజేష్‌, తిరుగు ప్రయాణంలో మైలవరం వైపు వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జి.కొండూరు శివారులోకి రాగానే 30వ నంబరు జాతీయ రహదారిపై గేదెను ఢీకొని కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్‌ని జి.కొండూరు పోలీసులు 108 అంబులెన్స్‌లో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్‌ బుధవారం ఉదయం మృతి చెందాడు.

చీకట్లో గేదె కనిపించక...

రహదారిపై గేదెను భారీ వాహనం ఢీకొట్టడంతో గేదె మృతి చెంది రోడ్డుపై పడి ఉంది. అదే సమయంలో అటుగా బైకుపై వస్తున్న రాజేష్‌కు రోడ్డుపై మృతి చెందిన గేదె చీకట్లో కనిపించక ఢీకొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి వీసా భాస్కరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ తెలిపారు.

గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్‌

తిరువూరు: సీలేరు నుంచి విజయవాడకు ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తూ ముగ్గురు యువకులు బుధవారం తిరువూరు పోలీసులకు పట్టుబడ్డారు. తిరువూరు మండలం లక్ష్మీపురానికి చెందిన మద్దిరాల లోకేష్‌, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వంశీ మరో మైనర్‌ బాలుడితో కలసి 8 కిలోల గంజాయిని ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా, తిరువూరు సమీపంలోని ముత్తగూడెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సెక్టార్‌–1 ఎస్‌ఐ సత్యనారాయణకు పట్టుబడ్డారు. తహసీల్దారు లక్ష్మి సమక్షంలో పంచనామా అనంతరం మైనర్‌ బాలుడిని విజయవాడలోని జువైనల్‌ హోంకు తరలించి, ఇరువురు యువకులను అరెస్టు చేసి తిరువూరు కోర్టులో హాజరుపరచినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ మేజిస్ట్రేట్‌ ఆదేశించారని చెప్పారు.

హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరు గ్రామంలో గత ఏప్రిల్‌ నెలలో జరిగిన హత్య కేసులో పోలీసులు ప్రధాన నిందతుడిని బుధవారం అరెస్టు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు మహిళా మండలి కాల్వ కట్టపై దేరంగుల పిచ్చయ్య(40) నివసిస్తున్నాడు. అతని భార్య అతనిని వదిలేయటంతో ఇంటి పక్కన ఉండే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 22న తనతో ఉన్న మహిళపై పిచ్చియ్య దాడి చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న మహిళ బంధువు వేల్పుల రమణ అలియాస్‌ అఖిల్‌ తనతో పని చేసే బిహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులతో ఆటోలో వచ్చి పిచ్చయ్యపై విచక్షాణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన పిచ్చయ్యను ఆస్పత్రిలో చికిత్సకు చేర్చారు. పోలీసులు ఈ ఘటనపై దాడి కేసు నమోదు చేసి నిందితులకు బెయిల్‌ ఇచ్చి వదిలేశారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చయ్య ఏప్రిల్‌ 25న మృతి చెందాడు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ఈ సమాచారం తెలిసి బెయిల్‌లో ఉన్న నిందితులు పరారయ్యారు. కేసులో ప్రధాన నిందితుడు అఖిల్‌ గన్నవరం మండలం చలుపలవారిగూడెంకు చెందిన వాడు కాగా, మిగతా ముగ్గురు బిహార్‌కు చెందిన వారు. గత నెలరోజులకు పైగా పోలీసుల గాలింపులో అఖిల్‌ను పోలీసులు ఎట్టకేలకు బుధవారం అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ఉన్న బిహార్‌కు చెందిన ముగ్గురి ఆచూకీ మాత్రం తెలియలేదు. ఆ ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం 1
1/1

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement