
కారుణ్యం చూపండి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో ఉద్యోగాలు చేస్తూ అనారోగ్య కారణాల తో, దురదృష్టవశాత్తు ప్రమాదాల కారణంగా మరణించినవారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు తమకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. కారు ణ్య నియామకాల కింద తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 88 మంది మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు అవు ట్ సోర్సింగ్ పద్ధతిలో తమకు ఉపాధి కల్పించాలని, ఇళ్లు గడవక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల విద్యార్హతలు ఉన్నప్పటికీ తమకు అవకశాం కల్పించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యా యం చేయాలంటూ 2016 నుంచి పోరాటం చే స్తున్నారు. ఉన్నతాధికారులు, మంత్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. అయితే కొందరు మరణించిన ఉద్యోగుల స్థానంలో కొందరు 2008 నుంచి 2016 వరకు పనిచేసినవారున్నారు. ఇలా పనిచేస్తున్నవారిని కూడా 2016 మార్చిలో ప్రభుత్వం తొలగించింది. విద్యార్హతలు ఉన్నవారిని కూడా తొలగించినట్లు ఆయా కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా వీరిని కారుణ్యం కింద పరిగణనలోకి తీసుకుని అవకాశాలు కల్పించాలని 2012లో అప్పటి గృహనిర్మాణ సంస్థ ఎండీ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు హైకోర్టు 2019లో ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ తమకు అవకాశాలు ఇవ్వలేదని కారుణ్య నియమాకాలు ఆశిస్తున్నవారు చెబుతున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో తమకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
● ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గృహనిర్మాణ సంస్థ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున వర్క్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల అవసరం ఉంది. ప్రస్తుతం గృహనిర్మాణ సంస్థలో చాలామంది
రెగ్యులర్ వర్క్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో తాజా గా రాష్ట్ర ప్రభుత్వం 390 మందిని అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేసుకుంది. అయి తే ఈ నియామకాల్లో తమకు అవకాశాలు కల్పించాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని కారుణ్య నియామకాల కోసం ఆశిస్తున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గృహనిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్లో ఉపాధి కల్పించాలంటున్న
మరణించిన ఉద్యోగుల కుటుంబీకులు
2016 నుంచి పోరాటం చేస్తున్న
88 మంది
అవకాశం ఇవ్వాలని 2019లో
ఆదేశించిన హైకోర్టు
తాజాగా 390 మంది
అవుట్సోర్సింగ్లో నియామకం
మరణించిన ఉద్యోగుల కుటుంబాలను మాత్రం పట్టించుకోని ప్రభుత్వం
న్యాయం చేయాలి..
గృహనిర్మాణ సంస్థలో కా రుణ్య విధానంలో కేవలం అవుట్ సోర్సింగ్ నియామ కాలు కల్పించాలని మా త్రమే కోరుతున్నాం. ఉన్న 88 మందిలో కుటుంబం గడవలేనివారు ఎక్కువగా ఉన్నారు. తమకు న్యా యం చేయాలని కోరుతూ గతంలో అనేకసార్లు గృహనిర్మాణ సంస్థ ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్ల అ సోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. మ రణించిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చే యాలని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదు.
– పగిడిపల్లి రామకృష్ణ,
మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా