
జిల్లాలో మొదటి కరోనా కేసు
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నగరంలోని అంబేడ్కర్కాలనీ చెందిన వ్యక్తికి రెండు రోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం రావడంతో శనివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కు చికిత్స నిమిత్తం వచ్చారు. వైద్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇంటి వద్దే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. అయితే ఇంటి వద్ద చిన్నపిల్లలు, వృద్ధులైన అమ్మనాన్న ఉండడంతో ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటానని బాధితుడు చెప్పాడు. వైద్యులు వెంటనే సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్కు సమాచారం ఇవ్వడంతో జీజీహెచ్లో 7వ అంతస్తులోని ఐసోలేషన్ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 2020 సంవత్సరంలో కూడా సదరు వ్యక్తికి కరోనా వచ్చినట్లు తెలిపారు.
నేడు కుటుంబ సభ్యులకు ర్యాపిడ్ పరీక్షలు
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి చెందిన సభ్యులకు ఆదివారం ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎవరికై నా పాజిటివ్ వస్తే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించనున్నట్లు ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వెంకటేష్ తెలిపారు.
మాస్క్లు, జాగ్రత్తలు తప్పనిసరి
జిల్లా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవా లని జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. మాస్క్లు ధరించాలన్నారు. చేతులు శానిటైజేషన్ చేసుకోవాలన్నారు. గుంపుల్లో సంచరించ వద్దని, ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా మాస్క్లు పెట్టుకోవాలన్నారు.
జిల్లా జనరల్ ఆస్పత్రిలో
చికిత్స పొందుతున్న బాధితుడు