సమగ్ర వ్యాధి నిర్ధారణ అంబులెన్స్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సమగ్ర వ్యాధి నిర్ధారణ అంబులెన్స్‌ ప్రారంభం

Jun 3 2025 5:47 AM | Updated on Jun 3 2025 5:47 AM

సమగ్ర

సమగ్ర వ్యాధి నిర్ధారణ అంబులెన్స్‌ ప్రారంభం

నిజామాబాద్‌అర్బన్‌ : జిల్లా వైద్యారోగ్యశాఖలోని ఎయిడ్స్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల వాహనాన్ని(అంబులెన్స్‌) కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ సాయి చైతన్యలతో కలిసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ ప్రారంభించారు. బీపీ, షుగర్‌తోపాటు టీబీ, హైపటైటిస్‌– బీ, సీ, హెచ్‌ఐవీ తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. ఈ వాహనం జిల్లాలోని అన్ని గ్రామాల్లోకి వెళ్తుందని, సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఆపరేషన్‌ సిందూర్‌

దేశానికే గర్వకారణం

సిరికొండ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ దేశానికే గర్వకారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి పేర్కొన్నారు. భారత సాయుధ దళాలకు గౌరవ సూచకంగా మండల కేంద్రంలో సోమవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. అంగడి బజార్‌ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేశ్‌ కులాచారి మాట్లాడుతూ పహల్గాంలో టూరిస్టులపై పాక్‌ ఉగ్రవాదులు చేసిన దాడికి బదులుగా భారత ఆర్మీ పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసిందన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి, జిల్లా నాయకులు నక్క రాజేశ్వర్‌, రాజేశ్వర్‌రెడ్డి, రామస్వామి, శ్రీనివాస్‌, సతీశ్‌, బాబూరావు, గోవింద్‌, ప్రభాకర్‌, నవీన్‌, లింబాద్రి, లింబాగౌడ్‌, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభం

జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్‌ గ్రామంలో ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో 5 ఎంఏ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ రవీందర్‌ సోమవారం ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ నుంచి 5 ఎంఏగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఓవర్‌ లోడ్‌ సమస్యను అధిగమించవచ్చని ఏఈ భాస్కర్‌ తెలిపారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి డీఈ రమేశ్‌, ఎంఆర్‌డీఈ వెంకటరమణ, రూరల్‌ ఏడీ భాలేష్‌, ఎంఆర్‌డీఈ నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి

ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలు

నిజామాబాద్‌అర్బన్‌: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి(మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంటముందుగానే చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే 90302 82993 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

సమగ్ర వ్యాధి నిర్ధారణ  అంబులెన్స్‌ ప్రారంభం 
1
1/2

సమగ్ర వ్యాధి నిర్ధారణ అంబులెన్స్‌ ప్రారంభం

సమగ్ర వ్యాధి నిర్ధారణ  అంబులెన్స్‌ ప్రారంభం 
2
2/2

సమగ్ర వ్యాధి నిర్ధారణ అంబులెన్స్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement