
పీసీసీ క్రమశిక్షణ సంఘం కార్యవర్గం ప్రమాణస్వీకారం
నిజామాబాద్సిటీ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో చైర్మన్గా మల్లు రవి, సభ్యుడిగా జిల్లాకు చెందిన జీవీ రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేపట్టారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, సభ్యులను జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. తన నియమకానికి కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కు రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు వచ్చిన ఈ పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎడ్ల నాగరాజ్, రాంభూపాల్, హరిబాబు, బాబి, ధర్మారం నవీన్, పత్తి శోభన్ కుమార్, సర్దార్ గబ్బర్ సింగ్, సుమన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
● రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
నిజామాబాద్నాగారం: మున్నూరు కాపు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతిభా అవార్డులను జిల్లా కేంద్రంలో అందజేశారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి, తోట రాజశేఖర్, బాల శ్రీనివాస్ పటేల్, ధర్మపురి సురేందర్, నరాల రత్నాకర్, అబ్బాపూర్ రవి, బుస్సా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, రెంజర్ల నరేశ్, హరిచరణ్, చిట్టి నారాయణరెడ్డి, సాయికుమార్, వాసు, శేఖర్, మోహన్, స్వర్ణలత, యెండల స్వప్న, ఆకుల పుష్పకుమారి పాల్గొన్నారు.
ప్రైవేట్ ఎలక్ట్రీషియన్కు
గాయాలు
నవీపేట: మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్లో ఆదివారం ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ను గాయాలయ్యాయి. స్టేషన్ ఏరియాకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సాయిలు పెట్రోల్ బంక్లో కరెంటు లేకపోవడంతో మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. ఎల్సీ తీసుకోకుండానే మరమ్మతులు చేయడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ గురయ్యాడు. చేతులకు, వీపుపై గాయాలయ్యాయి. స్థానికులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

పీసీసీ క్రమశిక్షణ సంఘం కార్యవర్గం ప్రమాణస్వీకారం