
బీసీలు ఏకమైతే అద్భుతాలు సృష్టించొచ్చు
నిజామాబాద్నాగారం: బీసీలందరూ ఏకమైతే అద్భుతాలను సృష్టించొచ్చని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభ మంగళవారం స్థానిక కపిల హోటల్లో భూమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుంజయ నాయుడు మాట్లాడుతూ...తరతరాలుగా చేతి వృత్తిదారులు, ఉత్పత్తి కులాల వారు అణచివేతకు గురవుతున్నారని, వారి హక్కుల సాధన కోసం మడమ తిప్పని పోరాటం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో నియోజకవర్గ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. దేశంలో బీసీలు మెజారిటీ ప్రజలుగా ఉన్నప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతకాల్సి వస్తోందని, ఇటీవల కాలంలో తెలంగాణలో బీసీ ఉద్యమాలు ఊపందుకోవడం హర్షించదగ్గ పరిణామమన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు చక్రపాణి, విట్టల్ గౌడ్, శ్రావణ్, పుప్పాల నాందేవ్, డీహెచ్పీఎస్ అధ్యక్షుడు కమలాపురం, రాజన్న, రేవతి, గోవర్ధన్, రాఘవేందర్, రాధా కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు