
ఆహ్లాదకరంగా
కాలూరులోని మినీ ట్యాంక్బండ్
నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని కాలూర్ గ్రామం (డివిజన్ 1)లోగల పెద్ద చెరువు వద్ద నిర్మించిన మినీ ట్యాంక్బండ్ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతోంది. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) ఆధ్వర్యంలో సుమారు రూ.80 లక్షల వ్యయంతో మినీ ట్యాంక్బండ్ను నిర్మించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టగా, నిధులు కొరత ఉంటే అప్పటి రూరల్ ఎమ్మెల్యే తన సొంత నిధులను కేటాయించి రెండేళ్ల క్రితం పనులు పూర్తిచేయించారు.
ఆధ్యాత్మికం.. ప్రశాంతత..
కాలూర్ మినీ ట్యాంక్బండ్ను సందర్శించడానికి గ్రామంతోపాటు జిల్లావాసులు తరలివస్తున్నారు. ట్యాంక్బండ్పై ఉన్న అందమైన మొక్కలు, చెట్లు, చుట్టూ పచ్చని వాతావరణం, పెద్దచెరువు అందాలను చూస్తూ కుటుంబ సమేతంగా ప్రజలు ప్రశాంత సమయాన్ని గడుపుతున్నారు. అలాగే ఈ ట్యాంక్బండ్పై శివాలయం, పెద్దమ్మ తల్లి ఆలయాలు ఉండటంతో ఆధ్యాత్మికంగాను ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అలాగే ట్యాంక్బండ్ చుట్టూ వేసిన అందమైన పేయింటింగ్ చిత్రాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా బతుకమ్మ విగ్రహం, ఇతర చిత్రాలు ఏర్పాటు చేశారు. అలాగే వివేకానంద విగ్రహం కూడా ఉంది. ఈ మినీ ట్యాంక్బండ్ను ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ఎక్కువగా సందర్శిస్తున్నారు. ప్రశాంత వాతావరణం ఉండటంతో పలువురు ఇక్కడ వాకింగ్తోపాటు వ్యాయామం కూడా చేస్తున్నారు.
కాలూర్ పెద్దచెరువుపై నిర్మాణం
సుమారు రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన నుడా
ఎంతో ఉపయోగకరం..
కాలూరు గ్రామంలోని మినీ ట్యాంక్బండ్ను నిత్యం ఎంతోమంది సందర్శించడానికి వస్తుంటారు. ఇక్కడ ప్రశాంత వాతావరణంతో పాటు ఆధ్యాత్మికంగా రెండు ఆలయాలు ఉన్నాయి. ప్రజలు సేద తీరడానికి, ప్రశాంతతకు మినీ ట్యాంక్బండ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. – భీమన్న, కాలూరు
గ్రామానికి గర్వకారణం..
మినీట్యాంక్బండ్కు జిల్లా న లుమూలల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి సేదతీరుతుంటారు. అదేవిధంగా సీనియర్ సిటీజన్లు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడానికి వస్తుంటారు. కాలూరు గ్రామానికి మినీ ట్యాంక్బండ్ ఉండడం ఎంతో గర్వకారణం. – ఎర్రన్న, కాలూరు

ఆకట్టుకుంటున్న పెయింటింగ్

మినీ ట్యాంక్బండ్పై ఉన్న పెద్దమ్మ ఆలయం


