కబ్జా ఎక్కడ జరిగిందో చూపించాలి | - | Sakshi
Sakshi News home page

కబ్జా ఎక్కడ జరిగిందో చూపించాలి

Mar 16 2024 12:50 AM | Updated on Mar 16 2024 12:50 AM

- - Sakshi

ధర్పల్లి: మండలంలోని రామడుగు గ్రామంలో పేదలకు ఇచ్చిన పట్టా భూమిని కబ్జా చేశారని ఫారెస్టు అధికారులు ఆరోపించడం సరికాదని, అసలు కబ్జా ఎక్కడైందో చూపించాలని సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ నాయకులు డిమాండ్‌ చేశా రు. ఈమేరకు తహసీల్దార్‌ కార్యాలయం ఎదు ట వారు పట్టాదారులతో కలిసి శుక్రవారం ధ ర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ మాలతికి వినతిపత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ సర్వేనం.1150లో ఎస్సీ,ఎస్టీ బీసీలకు చెందిన 250 మంది పేదల కు గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నా రు. ఆ భూమిలో పంటలు సాగు చేసుకోవడాని కి చదును చేస్తుంటే అటవీశాఖ అధికారులు అ డ్డుపడుతున్నారన్నారు.రమేష్‌, దామోదర్‌, లింబన్న, అనీస్‌, కిషోర్‌, రమేష్‌ పాల్గొన్నారు.

తర్ప డైరెక్టర్ల ఎన్నిక

నిజామాబాద్‌ నాగారం: శివాజీనగర్‌ మున్నూరుకాపు సంఘం పరిధిలోని గాండ్ల తర్ప–1 నూతన డైరెక్టర్లను శివాజీనగర్‌లోని తర్ప భవనంలో ఇటీవల ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా శెట్టి రాజేశ్‌, చిన్న గాండ్ల లింగం, రామర్తి నవీన్‌, పూదరి సాయిలు, గుండారం దినేశ్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పెద్దకాపు రామర్తి రా జు, తర్ప క్యాషియర్‌ భూమయ్య, శంభుని గు డి చైర్మన్‌ గాండ్ల లింగం, శివాజీనగర్‌ ము న్నూరుకాపు సంఘం మాజీ కార్యదర్శి శెట్టిరాజు, రామర్తి గోపి, గాండ్ల సంతోష్‌, సిరికొండ నర్సయ్య తదితరులున్నారు.

31న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక

నిజామాబాద్‌నాగారం: నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఈ నెల 31న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక నిర్వహించనున్నట్లు అఖిల భారత పద్మశాలి సంఘం సెంట్రల్‌ బోర్డు సభ్యుడు దాసరి నర్సింలు పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పద్మశాలి కుల బాంధవులందరు తమ కుటుంబంలోని వధువు, వరుడి ఫొటో బయెడెటాను రిజిస్ట్రేషన్‌ కోసం 9440091895 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. జగదీష్‌, నారాయణ, వెంకటేష్‌, రాజేంద్రప్రసాద్‌, భీమర్తి రవి, బొట్టు వెంకటేశ్‌, కస్తూరి గంగరాజు, మనోహర్‌, భూస రవి, లోల రాజు ఉన్నారు.

నర్సరీల నిర్వహణపై

ప్రత్యేక శ్రద్ధ వహించాలి

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): గ్రామాల్లో నర్సరీల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వందశాతం విత్తనాలు మొలకెత్తేలా ప్రతిరోజూ నీరు పట్టాలని ఎంపీడీవో లింగం నాయక్‌ సూచించారు. మండలంలోని కులాస్‌పూర్‌, చిన్నాపూర్‌, కంజర్‌ గ్రామాల్లో శుక్రవారం ఆయన నర్సరీలను పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ వేసవి దృష్ట్యా నర్సరీల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నాపూర్‌లో నీటి సమస్య ఉందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకురాగా, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్‌ఏలు, మేట్లు, సిబ్బంది ఉన్నారు.

ఘనంగా కాన్షీరాం జయంతి

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని జలాల్‌ పూర్‌ గ్రామంలో శుక్రవారం కాన్షీరాం జయంతి ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కా న్షిరాం విగ్రహానికి బహుజన నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బహుజనులకు రాజ్యధికారం కోసం కాన్షీరాం ఎంతాగానో కృషి చేశారన్నరు. నాయకులు, అంబేద్కర్‌ యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement