రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనకు ఎంపిక

Feb 16 2024 12:50 AM | Updated on Feb 16 2024 12:50 AM

మొక్కజొన్న కంకులు కాల్చే యంత్రం - Sakshi

మొక్కజొన్న కంకులు కాల్చే యంత్రం

సిరికొండ: రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనకు సత్యశోధక్‌ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికయ్యాయని ప్రిన్సిపాల్‌ నర్సయ్య తెలిపారు. గత డిసెంబర్‌లో జిల్లా స్థాయి ఆన్‌లైన్‌ ప్రదర్శనలో 8వ తరగతి విద్యార్థిని సీహెచ్‌ కృతిక రూపొందించిన కార్న్‌కాబ్‌ రోస్టింగ్‌ మెషీన్‌(మొక్కజొన్న కంకులు కాల్చుకునే యంత్రం), 7వ తరగతి విద్యార్థి జి అద్వైత్‌రెడ్డి తయారు చేసిన పిలింగ్‌ ద గ్రైన్స్‌ ఆపరేటింగ్‌ మెషీన్‌(ధాన్యాన్ని ఆరబెట్టుటకు, కుప్ప చేయుటకు ఉపయోగపడే యంత్రం)ల పనితీరు ప్రాజెక్టులను సమర్పించారు. పాఠశాల గైడ్‌ టీచర్‌ సతీశ్‌ నేతృత్వంలో ప్రతిభ నైపుణ్యంతో రూపొందించిన రెండు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. రెండు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికవ్వడం పట్ల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డులకు..

బాల్కొండ: మండల కేంద్రంలోని శాంభవి పాఠశాల విద్యార్థులు అభిజ్ఞ, సంయుక్త, తనీష జిల్లా స్థాయి సైన్స్‌స్పేర్‌ అవార్డులకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌ తెలిపారు. రాష్ట్ర స్థాయికి అభిజ్ఞ ఎంపికై ందన్నారు. పాఠశాలలో విద్యార్థులను ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement