సీవోఈ విద్యార్థుల ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

Jun 3 2025 12:09 AM | Updated on Jun 3 2025 12:09 AM

సీవోఈ

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2025 పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. సోమవారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ప్రకటించింది. ఇందులో కార్పొరేట్‌, ప్రైవేట్‌ కళాశాలలకు ధీటుగా సీవోఈ విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు గత మే 18న నిర్వహించారు. 14 మంది పరీక్షకు హాజరుకాగా ఐదుగురు అత్యుత్తమ ర్యాంకులు, మరో నలుగురు ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. సదరు విద్యార్థులను ర్యాంకుల ప్రాతిపదికన మంగళవారం నుంచి కౌన్సిలింగ్‌కు పిలవనున్నారు.

ర్యాంకులు సాధించిన విద్యార్థులు

షేక్‌ సుభాన్‌ 32,278, ఎస్‌.ఆదర్శ్‌ 3,285, కె.రంజిత్‌ 3,438, జి.చరణ్‌ 4,346, డి.రాజేందర్‌ 5,414 ర్యాంకులు సాధించి విజయ దుందుభి మోగించారు. కె.రామ్‌చరణ్‌ తేజ 296, సీ.హెచ్‌.సాయికుమార్‌ 311, ఎస్‌.వెంకటేశ్వర్‌ 1,952, బి.అంజిబాబు 4,790 ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. ప్రిన్సిపాల్‌ ఆకిడి విజయ్‌కుమార్‌, లెక్చరర్లు ప్రత్యేకంగా అభినందించారు.

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం1
1/4

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం2
2/4

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం3
3/4

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం4
4/4

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement