
‘సీఈఐఆర్’తో పట్టేస్తున్నారు..!
మహబూబ్నగర్ క్రైం: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మనిషి రోజువారి దినచర్యలో సెల్ఫోన్ భాగమైంది. ప్రతిఒక్కరి దగ్గర విలువైన స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. అయితే గతంలో ఫోన్లు చోరీకి గురైనా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా తిరిగి దొరకడం చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోల్పోయిన ఫోన్లను వెంటనే గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నారు. సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో పోగొట్టుకున్న సెల్ఫోన్లను వెనువెంటనే గుర్తించి రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ల రికవరీ శాతం గణనీయంగా పెరిగింది. దీంతో రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లు పలు సందర్భాల్లో చోరీలకు గురై కోల్పోయిన బాధితులు సకాలంలో తిరిగి లభించడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్స్టేషన్ల వారీగా..
జిల్లాలో 2024లో 3,261 సెల్ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు అందగా ఇందులో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1,141 ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. ఇందులో అత్యధికంగా జడ్చర్ల పోలీస్స్టేషన్ పరిధిలో 715, మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 576 ఫిర్యాదులు, వన్టౌన్ 381, రూరల్ 337, దేవరకద్ర 230 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది మే 31 వరకు 1,348 ఫిర్యాదులు రాగా.. 520 ఫోన్లను రికవరీ చేశారు.
చోరీకి గురైన సెల్ఫోన్ల గుర్తింపులోసాంకేతిక తోడ్పాటు
రూ.వేల విలువైన ఫోన్లు తిరిగి వస్తుండటంతో బాధితుల ఆనందం

‘సీఈఐఆర్’తో పట్టేస్తున్నారు..!