
చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని డీవైఎస్ఓ శెట్టి వెంకటేష్ అన్నారు. మండలంలోని జాజాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నెల రోజులపాటు నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. క్రీడాకారులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర జాతీయస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. క్రీడలు ఆడడం వల్ల మానసికోల్లాసంతోపాటు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉంటారని, ప్రతినిత్యం విద్యార్థులు పిల్లలకు వేసవి శిక్షణ శిబిరానికి పంపిస్తే వాళ్లు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తారని అన్నారు. నిజమైన ఆరోగ్యవంతులు క్రీడా స్ఫూర్తిని చాటి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని అన్నారు. కోచ్ రమేష్, పిడీ సాయినాథ్, క్రీడాకారులు కనకప్ప పాల్గొన్నారు.