
భక్తిశ్రద్ధలతో బక్రీద్
నారాయణపేట: బక్రీద్ (ఈద్ –ఉల్ –అజ్హా)ను శనివారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నారాయణపేట మార్కెట్ చైర్మన్ శివారెడ్డితో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు

భక్తిశ్రద్ధలతో బక్రీద్

భక్తిశ్రద్ధలతో బక్రీద్