బైక్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు

Jul 6 2025 7:01 AM | Updated on Jul 6 2025 7:01 AM

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు

హాలియా: అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలోని 565వ నంబర్‌ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మోరం నాగేశ్వరరావు అతడి భార్య లక్ష్మీపార్వతి, 18 నెలల కుమారుడు అభిరామ్‌తో కలిసి శనివారం బైక్‌పై తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని రంగుండ్ల గ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు కలిసి బైక్‌పై వెళ్తుండగా.. మార్గమధ్యలో అనుముల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోకి రాగానే హాలియా నుంచి సాగర్‌ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు, అతడి భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. హాలియా సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను మాచర్లకు తరలించారు. క్షతగాత్రుల బంధువు లక్ష్మీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయి ప్రశాంత్‌ తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

పెన్‌పహాడ్‌: ఇంట్లో నీటి మోటారుకు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్‌ మండలం చెట్లముకుందాపురం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్లముకుందాపురం గ్రామానికి చెందిన మామిడి శ్రీనివాస్‌(54) తన ఇంట్లోని నీటి ట్యాంకు వద్ద మోటారు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement