
తక్కువ ధరకు సిమెంట్ ఇప్పిస్తా
మునుగోడు : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. చండూరు డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గురువారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలసి మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీ యజమానులతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో మాట్లాడించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందేలా చేస్తానన్నారు. కొందరు అధికారుల అలసత్వం వల్ల కొన్ని గ్రామాల్లో అనర్హులకు ఇళ్లు మంజూరయ్యాయని.. వాటిని అధికారులు సరిద్దిది అర్హులకు అందేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతో పాటు ఈ ప్రాంతానికి సాగునీరు అందించితీరుతానన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చిందని.. అలాంటి తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, అమిత్ నారాయణ్, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, చండూరు ఆర్డీఓ రమణారెడ్డి, మార్కెట్ చైర్మన్ దొటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి