
బూత్లెవల్ ఆఫీసర్లకు శిక్షణ
శిక్షణ తరగతులకు హాజరైన బూత్లెవల్ ఆఫీసర్లు
ములుగు రూరల్: జాతీయ స్థాయి ఎన్నికల బూత్ లెవల్ ఆఫీసర్లకు జిల్లా కేంద్రంలోని కాన్ఫరెన్స్హాల్లో గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ మేరకు ములుగు మండలంలోని 59 బూత్ లెవల్ అధికారులు ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరైనట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఓటర్ జాబితా సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్భాస్కర్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ నితీష్, మాస్టర్ ట్రైనర్ తిరుపతి, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ మనోహర్, శివసాయిరాం, సూపర్వైజర్లు పాల్గొన్నారు.