
రోడ్డుపై గుంత.. కర్రే హెచ్చరిక
ఎస్ఎస్తాడ్వాయి: మండల కేంద్రంలోని కాటాపూర్ క్రాస్ వద్ద రోడ్డు గుంతపడింది. గుంత పూడ్చివేతకు చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు కర్రకు ఎరుపు రంగు సంచి కట్టి గుంతలో పెట్టి వాహనాదారులకు ప్రమాద హెచ్చరికగా ఏర్పాటు చేశారు. ఈ దారిగుండా రాత్రి, పగలు వందల సంఖ్యలో వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. రోడ్డుపై పడిన గుంతను పూడ్చాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా కర్ర ఏర్పాటు చేయడంపై వాహనాదారులు అధికారుల నిర్లక్ష్యం తీరుపై మండి పడుతున్నారు. రోడ్డుపై పడిన గుంత కంటే కర్రే ప్రమాదకరంగా ఉందని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి గుంతను పూడ్చివేయాలని పలువురు కోరుతున్నారు.