
ఉద్యాన పంటల సాగును పెంచాలి
ఏటూరునాగారం: జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి సంజీవరావు అన్నారు. జిల్లాలో 27వేల ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తీర్ణం ఉందని, మిర్చి 24,239 ఎకరాలు, పంట్ల తోటలు 673 ఎకరాలు, ఆయిల్పామ్ 2,658 ఎకరాల్లో సాగు అవుతుందన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని ఎక్కెల హెచ్ఎన్టీసీ, చిన్నబోయినపల్లి, పెద్ద వెంకటాపురంలోని టిఫ్యూకల్చర్, ఆయిల్ పామ్ తోటల్లో ఆదివారం మంగళవారం తనిఖీలు చేశారు. హర్టికల్చర్ పంటల్లో తక్కువ నీటితో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. ఆయిల్పామ్ పంటలు, పండ్ల తోటల సాగు, డ్రిప్ సేద్యం, వెదురు మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకాలను ఉద్యానశాఖ సబ్సిడీలు అందిస్తుందని వివరించారు. ఈ ఏడాది పండ్ల తోటలు 152, మామిడి 7, అరటి 77 ఎకరాలు, నిమ్మ 5, జామ 2.5 ఎకరాలు, దానిమ్మ 5 ఎకరాలు, ఆయిల్పామ్ 3వేల ఎరాల్లో సాగు చేయాల ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారులు, కంపెనీ ప్రతి నిధులు, డ్రిప్ కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ
అధికారి సంజీవరావు

ఉద్యాన పంటల సాగును పెంచాలి