
రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ గురించి కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్( Karthik Subbaraj) పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన కొత్త సినిమా 'రెట్రో' ప్రమోషన్స్లో భాగంగా 'గేమ్ ఛేంజర్' ఫలితం గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాకు సుబ్బరాజే కథ అందించారు. ఇదే విషయాన్ని దర్శకుడు శంకర్ కూడా పలు వేదికల మీద చెప్పారు. అయితే, తాజాగా ఈ సినిమాలో తన ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పడం విశేషం.
'గేమ్ ఛేంజర్' గురించి కార్తీక్ సుబ్బరాజ్ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను కేవలం వన్ లైన్ మాత్రమే గేమ్ఛేంజర్ కోసం ఇచ్చాను. గ్రౌండెడ్గా ఉండే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ పాయింట్తో స్టోరీ ఇస్తే చివరకు అది చాలా మార్పులకు లోనైంది. ఆ కథలో చాలామంది రచయితలు వేలు పెట్టడంతో చివరికి మరో రకంగా అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా విషయంలో ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఎవరూ ఊహించలేరు. జయాపజయాలు ఎప్పటికీ మనచేతుల్లో ఉండవు.' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, ఇదే మాట సినిమా విడుదల సమయంలో ఎందుకు చెప్పలేదంటూ కార్తీక్ సుబ్బరాజ్ను మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రిలీజ్కు ముందు మాత్రం కథ మొత్తం నాదే అంటూ చెప్పి.. ఇప్పుడు సినిమా ఫలితం అనుకున్నంతగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అందరూ కలిసి చరణ్ను తీవ్రంగా నష్టపరిచారని వారు చెబుతున్నారు. 'గేమ్ ఛేంజర్' విడుదలకు ముందు సుబ్బరాజ్ ఏమన్నారంటే.. 'గేమ్ ఛేంజర్' స్టోరీ రాశాగానీ అది పక్కా శంకర్ విజన్తో రూపొందించబడుతుందని బహిరంగంగానే సుబ్బరాజ్ చెప్పారు. తన కథను తెరపైకి శంకర్ తీసుకొస్తే ఎలా ఆనందంగా ఉంటుందన్న దానికి గేమ్ ఛేంజర్ సినిమా నిదర్శనం అంటూ చెప్పారు. తన కథతో శంకర్ మూవీ తీయడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం అంటూ సుబ్బరాజ్ పేర్కొన్నారు.
"I have given only one liner of #GameChanger story to Shankar sir. In my version IAS officer was grounded, was excited to see Shankar sir's version. Many writers came onboard and so story & screenplay has been changed. Yes film didn't work audience🙁"
-KSpic.twitter.com/DKNuUPh48G— AmuthaBharathi (@CinemaWithAB) April 24, 2025