
బోధనలో సాంకేతికతను జోడించాలి
డీఈఓ రాధాకిషన్
మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెంచేలా బోధనలో సాంకేతికతను జోడించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండో విడత భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. అన్ని పాఠశాలల్లో ఐఎఫ్టీ ప్యానల్స్ అందుబాటులో ఉన్నందున, ఏఐ సాంకేతికతను ఉపయోగించి బోధించాలని సూచించారు. రిసోర్స్పర్సన్ సొంతంగా తయారు చేసిన బోధన అభ్యసన సామగ్రిని పరిశీలించారు. ఉపాధ్యాయులు కూడా ఇదే విధమైన బోధన అభ్యసన సామగ్రిని రూపొందించుకొని బోధించాలన్నారు. ప్రయోగాలు, కృత్యాలను వీడియో ద్వారా చిత్రీకరిస్తూ నేరుగా ఐఎఫ్టీ ప్యానల్స్లో వీక్షించే విధంగా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందన్నారు. ఉపాధ్యాయులంతా దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతకుముందు డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కోర్స్ కోఆర్డినేటర్ రేఖ, రిసోర్స్ పర్సన్లు రాజ్కుమార్, మహేందర్, వెంకటరమణ పాల్గొన్నారు.